సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

PPM: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిలో తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. ఈ ప్రజా దర్బార్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.