రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

TPT: బాలాయపల్లి మండలం వాక్యం గ్రామానికి చెందిన నర్రావుల బాబుని గురువారం రైలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో మృతి చెందాడు. ఉదయం ఊరు నుంచి గూడూరుకు వచ్చిన బాబు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.