భారీ వర్షాలకు 4392.55 ఎకరాల్లో పంట నష్టం

భారీ వర్షాలకు 4392.55 ఎకరాల్లో పంట నష్టం

KMR: జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు 4392.55 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు DAO మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 2,522 మంది రైతులకు ఈ నష్టం వాటిల్లిందని చెప్పారు. సోయా-2,540 ఎకరాలు, వరి-1,619.15, పత్తి-85, పెసలు-100, మొక్కజొన్న- 97, టమాట, కాకర, బీర- 1.4 ఎకరాల్లో ప్రాథమిక అంచనా ప్రకారం ఈ నష్టం జరిగిందని పేర్కొన్నారు.