పత్తికొండలో అమరావతికి బైక్ ర్యాలీ

పత్తికొండలో అమరావతికి బైక్ ర్యాలీ

KRNL: పత్తికొండలో అమరావతి రాజధాని నిర్ణయానికి మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కే.ఈశ్యాం కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగుతూ ‘జై అమరావతి’ నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి మేలు చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.