జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలి: ఎమ్మెల్యే
ATP: రాష్ట్ర వ్యాప్త జనగణనలో భాగంగా రామగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలిసి తన కుటుంబ గణాంకాలను నమోదు చేశారు. జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలంటే ఖచ్చితమైన వివరాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.