NSU ఘటనపై వీసీకి నోటీసులు ఇచ్చిన NCW

NSU ఘటనపై వీసీకి నోటీసులు ఇచ్చిన NCW

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థిని పట్ల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి 15 రోజుల్లోపు కమీషన్‌కు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల మహిళా కమీషన్ సభ్యురాలు వర్సిటీలో విచారణ చేసిన విషయం తెలిసిందే.