ఆటో బోల్తా.. డ్రైవర్ మృతి
NZB: ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో బుధవారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడింది. ఆటో ప్రమాదవశాత్తు కెనాల్లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే ఆటో డ్రైవర్ మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.