పరిశుభ్రతపై దుకాణదారులకు అవగాహన

పరిశుభ్రతపై దుకాణదారులకు అవగాహన

NLG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా చిట్యాల మండలం నేరడలో గురువారం మటన్, చికెన్ షాపుల వద్ద పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై దుకాణ దారులకు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ మిర్యాల మహేందర్ తగు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు.