కందుకూరులో మొదటిసారి ఓటేసిన యువతులు
RR: మూడో విడత పంచాయతీ ఎన్నికలు సైతం ముగింపు దశకు చేరుకుంది. ఇంకాస్తా సమయం మాత్రమే మిగిలి ఉండడంతో ఓటర్లు పరుగులు తీస్తున్నారు. కాగా, మండలంలోని బేగరికంచలో యువతులు మొదటిసారిగా పంచాయతి ఎన్నికల ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. సర్పంచ్ ఎనికల్లో మొదటిసారిగా ఓటేయడం చాలా సంతోషంగా ఉందని, గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామ అభివృద్ధి చేయాలని కోరారు.