హర్మూజ్ జలసంధి దాటిన భారత గ్యాస్ నౌకలు
గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య భారత్కు భారీ ఊరట లభించింది. హర్మూజ్ జలసంధిని 'నందా దేవి'తో పాటు మరో LPG ట్యాంకర్ క్షేమంగా దాటాయి. 'శివాలిక్' ఆయిల్ ట్యాంకర్ ఇప్పటికే భారత్ వైపు వస్తోంది. భారత నౌకల భద్రతపై ఇరాన్తో కేంద్రం జరిపిన సంప్రదింపులు ఫలించాయి. దీంతో దేశంలో ఇంధన సరఫరాపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం ఈ నౌకలు భారత తీరానికి చేరువలో ఉన్నాయి.