VIDEO: డ్రింక్ సీసాతో పొడిచిన లారీ డ్రైవర్
ELR: ముదినేపల్లి (M) చిగురుకోటలో డ్రింక్ సీసాతో పొడిచిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. చెరువులు లీజుకు తీసుకుని సాగుచేస్తున్న అయ్యవారి రుద్రవరానికి చెందిన దేవీ కోటేశ్వరప్రసాద్తో శనివారం లారీ డ్రైవర్ సత్యనారాయణ, రామకృష్ణలకు గొడవ జరిగింది. ఆవేశానికి గురైన సత్యనారాయణ తన దగ్గర ఉన్న డ్రింక్ సీసాను పగలగొట్టి ప్రసాద్ను పొడిచాడని స్థానికులు తెలిపారు.