మునుగోడులో 7.32 ఎకరాల భూమి స్వాధీనం
NLG: మునుగోడు మండలంలో అక్రమణకు గురైన 7.32 ఎకరాల సాగు భూమిని రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం విజయవంతంగా విముక్తి చేసింది. ఆర్డీవో శ్రీదేవి పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్లో ఆక్రమణలను తొలగించి, భూమిని తిరిగి అర్హులైన రైతులకు అప్పగించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.