మరణించిన పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత
GNTR: గుంటూరు జిల్లాలో మృతి చెందిన కుటుంబాలకు ఎస్పీ కార్యాలయంలో ఒక్కొక్క కుటుంబానికి ఎస్పీ వకుల్ జిందాల్ రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలు అమూల్యమైనవని తెలిపారు. వారి కుటుంబాలకు పోలీస్శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యాలయంలో ఏవో శ్రీ వేంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.