ఫోన్ కాల్స్ ద్వారా ఇన్సూరెన్స్ మోసాలు
WGL: నర్సంపేట పట్టణానికి చెందిన పలువురికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి “గిఫ్ట్ లక్కీ డ్రా గెలిచారు” అంటూ వరంగల్కు రమ్మని పిలుస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అక్కడికి వెళ్లిన తర్వాత భార్యాభర్తలు కలిసి రావాలని చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలని బాధితులు కోరారు.