కొత్తచెరువు మండలంలో వైసీపీకి షాక్
సత్యసాయి: కొత్తచెరువు మండలం లోచర్ల పంచాయతీ మామిళ్లకుంట క్రాస్ వద్ద టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.