GOOD NEWS చెప్పిన డిప్యూటీ సీఎం
TG: వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పాలనను సులభతరం చేసేందుకు తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఒకే దగ్గర నిర్మించాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పర్యాటక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.