భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతాం: PDSU

భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతాం: PDSU

ATP: కనేకల్ మండలం బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులు భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యాలయాల్లో తప్పు జరిగితే భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యమాలు చేపడతామని పీడీఎస్యూ యువత పేర్కొన్నారు. భగత్ సింగ్ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు.