నేటి నుంచి 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర'
AP: ఇవాళ్టి నుంచి 'అటల్-మోదీ సుపరిపాలన యాత్ర' ప్రారంభం కానుంది. వాజ్పేయీ శత జయంతి ముగింపు సందర్భంగా సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ధర్మవరంలో బీజేపీ చీఫ్ మాధవ్ బస్సు యాత్ర ప్రారంభిస్తారు. ఇవాళ్టి నుంచి ఈనెల 25 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నెల 25న అమరావతిలో వాజ్పేయీ జయంతి సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహావిష్కరణ చేస్తారు.