వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు సమయం
CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండిపోయి.. భక్తులు ఆలయం వెలుపలకు వచ్చారు. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవెరక్షించారు.