'నిబంధనలు పాటించకపోతే బ్లాక్ లిస్టులో పెడతాం'
PPM: ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్ ప్రక్రియలో నిబంధనలను పాటించని మిల్లర్లపై జిల్లా యంత్రాంగం కఠిన వైఖరిని అవలంబించింది. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర రెడ్డి పాల్గొన్నారు. అగ్నిమాపక భద్రతతో సహా కనీస ప్రాథమిక వసతులు, భద్రతా ప్రమాణాలు పాటించని మిల్లర్లను వెంటనే బ్లాక్ లిస్టు చేయాలన్నారు.