ఉద్యానవనంలో రక్త పింజరి కలకలం.. వలలు ఏర్పాటు
కాకినాడ సర్పవరంలో శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో వాకింగ్ ట్రాక్ వద్ద రక్త పింజరి పాము సంచరిస్తూ సందర్శకులను భయాందోళనకు గురిచేస్తోంది. వాకింగ్కు వెళ్లిన స్థానికులకు రక్త పింజరి పలువురి కంటపడి భయాందోళనకు గురైన నేపథ్యంలో ఈవో రాపాక శ్రీనివాస్ స్పందించి స్నేక్ క్యాచర్ను రప్పించి, ఉద్యానవనంలో వలలు ఏర్పాటు చేశారు.