'ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి'
VZM: ప్రజల సమస్యలను చట్ట పరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 25 ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు–8, కుటుంబ కలహాలు–4, మోసాలు–3, ఇతర అంశాలు–10 ఉన్నాయన్నారు. అధికారులు ఫిర్యాదులను లోతుగా పరిశీలించాలన్నారు.