VIDEO: పెరిగిన మిర్చి ధరలు.. స్థిరంగా పత్తి ధర
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.15,500, నాన్ ఏసీ మిర్చి క్వింటాకు రూ.8,100, పత్తి ధర రూ.6,950 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఏసీ ఏసీ మిర్చి రూ.200, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100 పెరగగా.. అటు పత్తి ధర మాత్రం రూ.50 తగ్గినట్లు పేర్కొన్నారు.