'ప్రతి కార్మికుడు పారిశ్రామికవేత్త కావాలి'

KRNL: ప్రతి చేనేత కార్మికుడు ఒక పారిశ్రామిక వేత్త కావాలని చేనేత & జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో చేనేత కార్మికుల ఐడి కార్డులు, సొసైటీ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషతో కలిసి సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులు సొసైటీలుగా ఏర్పాటై ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి అన్నారు.