పుంగనూరులో 21న డయల్ యువర్ డీఎం

CTR: పుంగనూరు ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని ఈనెల 21న గురువారం ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని డీఎం సుధాకరయ్య ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సేవలపై సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు సలహాలు, సూచనల కోసం 9100941850 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.