'పౌర సేవల్లో నిర్లక్ష్యం వహించకూడదు'

'పౌర సేవల్లో నిర్లక్ష్యం వహించకూడదు'

KMM: ఖమ్మం నగర పాలక సంస్థ ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 6వ రోజు 'ప్రజా పాలన' కార్యక్రమం వేగంగా సాగింది. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య వివిధ విభాగాల్లో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. పౌర సేవల అమలులో నిర్లక్ష్యం వహించకూడదని, కీలకమైన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి పాలనలో వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.