జిల్లాలో RTC సమ్మె యధావిధిగా కొనసాగుతుంది: SWF
ADB: రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలమైనందున జిల్లాలో సమ్మె యధావిధిగా కొనసాగుతుందని SWF రీజనల్ సెక్రటరీ భీం రావ్ తెలిపారు. మంగళవారం పట్టణంలో సమావేశమై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రజా రవాణా సంస్థను పరిరక్షించేందుకు ప్రజలు తమతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.