రెండు రోజులు విద్యుత్ సరఫరాకు ఆటంకం
MNCL: మంచిర్యాలలోని 38వ డివిజన్ పరిధి శ్రీశ్రీ నగర్, SRR కాలనీ, అనూ నగర్, భగత్ సింగ్ నగర్లలో ఇవాళ, రేపు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. రాబోయే వేసవి కాలంలో హై ఓల్టేజీని అధిగమించేందుకు 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ కోసం టవర్లు ఏర్పాటు చేయడం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు.