'కృషి ఉంటేనే విజయం'
GDWL: గ్రామీణ క్రీడాకారులు కృషి, పట్టుదలతో జాతీయ స్థాయిలో రాణించాలని బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ ఆకాంక్షించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బింగిదొడ్డిలో ఆదివారం గ్రామ స్థాయి కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడలతో స్నేహ, సోదర భావాలు పెంపొందుతాయని, ఓడిన క్రీడాకారులు నిరాశ చెందకుండా గెలుపుకై ప్రయత్నించాలని సూచించారు.