'చిన్నారుల భద్రతకు సమగ్ర విధానం అవసరం'
అన్నమయ్య: డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి రచించిన '16 ఏళ్లలోపు చిన్నారుల సోషల్ మీడియా వినియోగం–నియంత్రణ' పుస్తకాన్ని శనివారం పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే. శామ్యూల్ ఆవిష్కరించారు. చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై సమతుల్య విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.