ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
MLG: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజల సమస్యలను తీర్చాలని కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో 46 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 13, భూ సమస్యలపై 8, పింఛను సంబంధించి 5, ఇతర సమస్యలపై 20 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.