ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. ఇరుపక్షాల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.