పారిశుధ్య నిర్వహణ పై MPDO ఆకస్మిక తనిఖీ
VZM: బొబ్బిలి MPDO రవికుమార్ ఇవాళ స్దానిక జగన్నాధపురంలో పారిశుద్ధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వీధులు, కూడళ్లలో చెత్త సేకరణ తీరును పరిశీలించి, తడి, పొడి చెత్త వేరుచేయడం, ప్రజల భాగస్వామ్యం గురించి ఆరా తీసారు. ఆయన మాట్లాడుతూ.. చెత్త పేరుకు పోకుండా వెంటనే చర్యలు తీసుకేవాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.