EVM గోదాం భద్రతపై కలెక్టర్ సంతృప్తి
GNTR: గుంటూరు జిల్లాలోని EVM గోదాంను జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ గురువారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రతా ఏర్పాట్లు, నిర్వహణపై సమగ్రంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ, గార్డ్ రూములు, ఇన్వర్టర్ వ్యవస్థలను కలెక్టర్ పరిశీలించారు.