ఒమన్, కువైట్ దేశాధినేతలకు మోదీ ఫోన్
ఒమన్, కువైట్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఒమన్, కువైట్పై దాడులను ఖండించారు. భారతీయుల భద్రతపై ఇరుదేశాల ప్రతినిధులతో చర్చించారు. మరోవైపు ఈయూ నేతలతో విదేశాంగ మంత్రి జయశంకర్ మంతనాలు చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో కోటిమంది భారతీయులు నివస్తున్నారని తెలిపారు. వారి భద్రతే ముఖ్యమని ప్రకటించారు.