ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
ELR: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి దాతలు అందించే సహకారం మరువలేనిదని దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం పెదవేగి మండలం ముండూరులో నూతన ఆయుష్ ఆసుపత్రి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన మహంకాళి సుబ్రహ్మణ్యం గుప్త ఆసుపత్రి కోసం స్థలాన్ని దానంగా ఇవ్వడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని అన్నారు