ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన పీడీ
NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలో శనివారం హౌసింగ్ పీడీ శంకర్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు. స్లాబ్లు పూర్తైన లబ్ధిదారులు మిగిలిన పనులను వేగవంతం చేసి త్వరగా గృహప్రవేశాలు చేయాలని సూచించారు. పనుల్లో జాప్యం చేయకుండా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.