'మాదకద్రవ్యాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం'

కోనసీమ: మాధక ద్రవ్యాలకు అలవాటు పడితే యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అమలాపురం రూరల్ ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. ఆయన అమలాపురం రూరల్ మండలంలోని బండారులంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల గురించి సోమవారం వివరించి అవగాహన సదస్సులు నిర్వహించారు. మాదకద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను ప్రజలకు విద్యార్థులు వివరించాలన్నారు