BSP పలమనేరు కన్వీనర్గా లక్ష్మమ్మ
CTR: బహుజన సమాజ్ పార్టీ (BSP) పలమనేరుకు అసెంబ్లీ కన్వీనర్గా ముడివారిపల్లి గ్రామానికి చెందిన హెచ్. లక్ష్మమ్మ నియమితురాలయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా ఇంఛార్జ్ శివాజీ గోవిందయ్య ప్రకటన విడుదల చేశారు. అనంతరం బహుజన రాజ్యాధికార సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.