రాష్ట్రస్థాయి పోటీలకు నర్సింగాపూర్ విద్యార్థిని ఎంపిక
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎర్రం హేమ అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు HM జితేందర్ గురువారం తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 హ్యాండ్బాల్ బాలికల విభాగంలో సిరిసిల్ల జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి, రాష్ట్రస్థాయికి ఎంపికైంది.