జిల్లాపై యుద్ధం ఎఫెక్ట్.. తగ్గిన సరఫరా
పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధ పరిణామాలతో తిరుపతి జిల్లాలో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా తగ్గగా.. డొమెస్టిక్ బుకింగ్లు భారీగా పెరిగాయి. ఆన్లైన్, ఫోన్ బుకింగ్లు నిలిచిపోవడంతో డెలివరీకి 30 రోజులకు పైగా సమయం పడుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈ సంక్షోభంపై చర్చించేందుకు ఇవాళ కలెక్టర్ ఆధ్వర్యంలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లతో కీలక సమావేశం జరగనుంది.