స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.270 పెరిగి రూ.1,30,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.250 పెరిగి రూ.1,19,550 పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర రూ.2,100 ఎగబాకి రూ.1,98,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.