ఘనంగా వైఎస్ పాదయాత్ర వార్షికోత్సవం
VSP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రజల సమస్యలను తెలుసుకుని సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి సేవలందించారని గుర్తుచేశారు. ఆయన పాలనను స్వర్ణయుగంగా అభివర్ణించారు.