బీజేపీ ఆవిర్భావ: కొబ్బరి బోండాపై కమలం చిత్రం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ బీజేపీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా కొబ్బరి బోండాపై కమలం చిత్రం వేసి ఆకట్టుకున్నాడు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీకి ప్రజలలో ఎనలేని గుర్తింపు లభించిందని చిత్రం ద్వారా పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన పలువురు బాల్ కిషన్ ప్రతిభను కొనియాడారు.