పీలేరు పోలీస్ స్టేషన్లో వృద్ధుడు కుప్పకూలి మృతి
KDP: పీలేరు పోలీస్ స్టేషన్లో భూవివాద ఫిర్యాదు కోసం వచ్చిన 80 ఏళ్ల చంద్రారెడ్డి మంగళవారం కుప్పకూలి మృతి చెందారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు మృతి చెందారని ధృవీకరించారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు రికార్డు చేసి దర్యాప్తు ప్రారంభించారు.