'చందనపల్లి డంపింగ్ యార్డును తరలించాలి'

'చందనపల్లి డంపింగ్ యార్డును తరలించాలి'

NLG: నల్లగొండలోని చందనపల్లి డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఉదయసముద్రం చెరువు పక్కన ఉండటంతో నీరు కలుషితమవుతోందని, చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జంతు కళేబరాల వల్ల రోగాలు వ్యాపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.