పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద
CTR: పాలసముద్రం మండలంలో అడవి పందుల బెడద పెరిగింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలను పందులు ధ్వంసం చేస్తున్నాయి. 13 పంచాయతీల్లో ఒకో రైతు ఐదు ఎకరాల పంటలో మూడు ఎకరాల వరకు నష్టపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.