పమిడిమర్రులో పాస్పుస్తకాల పంపిణీ
BPT: నగరం మండలం పమిడిమర్రు గ్రామంలో మంగళవారం పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ అధికారులు రైతులకు రీ సర్వే పాస్ పుస్తకాలను అందజేశారు. సమగ్ర భూముల రీ సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కొత్త పాస్ పుస్తకాలను అందుకున్న రైతులు సంతోషం వ్యక్తం చేశారు.