కోడుమూరులో కూలీన ఇంటి మిద్దె..!

కోడుమూరులో కూలీన ఇంటి మిద్దె..!

KRNL: కోడుమూరులోని మెయిన్ బజార్‌లో చేనేత కార్మికుడు బండ చంద్రశేఖర్ ఇంటి మట్టి మిద్దె గత రాత్రి కూలిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనలో తల్లి, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఘటన స్థలాన్ని ఇవాళ పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం చేసి ఇల్లు నిర్మాణం, మగ్గం ఏర్పాటు చేయలన్నారు.