దాడి చేసిన ఘటనలో 8 మందిపై కేసు

దాడి చేసిన ఘటనలో 8 మందిపై కేసు

KDP: కొండాపురంలోని శాంతినగర్ కాలనీలో జరిగిన ఘర్షణలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు SI జయరాములు బుధవారం తెలిపారు. SI వివరాల మేరకు.. పాత కక్షలతో శాంతినగర్ కాలనీకి చెందిన రమేష్ మరో ఏడుగురితో కలిసి ఆదే కాలనీకి చెందిన నాగేష్ కుటుంబంపై మంగళవారం రాత్రి దాడి చేశాడు. ఈ ఘటనపై కొండాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.